ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హస్తం ఉందంటూ బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రగతి భవన్, గాంధీ భవన్ భాయ్ భాయ్..!! ఢిల్లీలో తీగ లాగితే.. ప్రగతి భవన్, గాంధీభవన్ వ్యాపార సంబంధాల డొంక కదిలింది అంటూ ఆయన ట్వీట్ చేశారు. తెర ముందు పోరాటం.. తెర వెనక వ్యాపారం ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో రేవంత్ రెడ్డి చీకటి కోణం బయటపడిందని అంటూ రాజగోపాల్ ఆరోపించారు.
ప్రగతి భవన్ ?? గాంధీ భవన్
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) September 9, 2022
భాయ్ భాయ్ !!
రేవంత్ రెడ్డి @revanth_anumula నాటకాలకు, కల్వకుంట్ల @RaoKavitha డ్రామాలకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం తెర దించింది.
ఢిల్లీలో తీగ లాగితే ప్రగతి భవన్ & గాంధీభవన్ వ్యాపార సంబంధాల డొంక కదిలింది. pic.twitter.com/6ZZI4JW8l5
రాజగోపాల్ రెడ్డి ఆరోపణల పై రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 'చచ్చిన బర్రె పగిలిన కుండ నిండ పాలిచ్చిందన్నట్టు రాజగోపాల్ వ్యవహారం ఉందంటూ విమర్శించారు. 2010 ఫిబ్రవరి 2న ఆ కంపెనీలో డైరెక్టర్గా చేరానని, 13 రోజుల్లో ఫిబ్రవరి 15న రిజైన్ చేశానట్టుగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఆధారాలను రేవంత్ రెడ్డి తన ట్వీట్ లో పోస్ట్ చేశారు. అసలు ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే 2013లో కంపెనీ క్లోజ్ అయిందని రేవంత్ తెలిపారు. ఇలాంటి చిల్లర కథలు ఏ విధంగాను మునుగోడులో మిమ్మల్ని కాపాడలేవంటూ రేవంత్ పోస్ట్ చేశారు.
చచ్చిన బర్రె పగిలిన కుండ నిండ పాలిచ్చిందన్నట్టు రాజగోపాల్ వ్యవహారం ఉంది.
— Revanth Reddy (@revanth_anumula) September 9, 2022
2010 ఫిబ్రవరి 2న ఆ కంపెనీలో డైరెక్టర్ గా చేరాను. 13 రోజుల్లో… ఫిబ్రవరి 15న రిజైన్ చేశాను.
ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే 2013 లో కంపెనీ క్లోజ్ అయింది.
ఇలాంటి చిల్లర కథలు… మునుగోడులో మిమ్మల్ని కాపాడలేవు. https://t.co/9Mtr1LjGjc pic.twitter.com/oTGes8A9q7