మేడారం నుంచి రేవంత్ పాదయాత్ర స్టార్ట్ : సీతక్క

మేడారం నుంచి రేవంత్ పాదయాత్ర స్టార్ట్ : సీతక్క

ఈ నెల 6న మేడారం నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే సీతక్క వెల్లడించారు. మొదట సమ్మక్క, సారలమ్మ దర్శనం చేసుకుని యాత్రను ప్రారంభిస్తారని చెప్పారు. ఈ యాత్రతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మలుపు తిరుగుతుందన్నారు. ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో ఆమె పర్యటించారు. పొనుగొండ్ల గ్రామంలోని పగిడిద్దరాజు ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్తోనే పోడు భూముల సమస్య పరిష్కారమవుతుందని.. పోడు భూములు విషయంలో  మంత్రుల మాటలు నమ్మవద్దని సూచించారు. కేసీఆర్ ది హామీల ప్రభుత్వం తప్పా.. అమలు చేసే ప్రభుత్వం కాదన్నారు.