కార్యకర్తలపై చేయివేస్తే ఊరుకునేది లేదు: రేవంత్ రెడ్డి

కార్యకర్తలపై చేయివేస్తే ఊరుకునేది లేదు: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఈగ వాలనివ్వనని.. కార్యకర్తలపై చేయి వేస్తే ఊరుకునేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తాండూరు గడ్డ కాంగ్రెస్‌ కు అడ్డా అని.. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీకి ద్రోహం చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గురువారం(ఆగస్టు 24) తాండూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గజ్వేలు సిద్దిపేటకు మాత్రమే నీళ్లు తెచ్చుకుని.. మన ప్రాంతానికి సీఎం కేసీఆర్  అన్యాయం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

ఒక్క సీటైనా ఇచ్చారా?

కేసీఆర్ ముదిరాజ్‌లకు ఒక్క సీటైనా ఇచ్చారా?.. ముదిరాజులు ఈ రాష్ట్ర ప్రజలు కారా అని రేవంత్ ప్రశ్నించారు. ఈటలపై కోపం ఉంటే ఇంకో ముదిరాజ్ నాయకుడికి ఇవ్వాల్సిందని సూచించారు. బీసీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే మరో రెడ్డికి ఇచ్చారని విమర్శించారు. తొమ్మిది మంది అగ్రవర్ణాల వారు మంత్రులుగా ఉన్నా నేడు మరో పెద్ద రెడ్డికి ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తెలిపారు. 

అసదుద్దీన్‌కు సీఎం కేసీఆర్ ఎం చేశారో ఏమో.... మళ్లీ కేసీఆర్‌ను గెలిపించేందుకు పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్, మోదీ, అసదుద్దీన్ అందరూ ఒక్కటేనని.. ఓటు ఎవరికేసీనా వారికేసినట్లేనని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించాలని చెప్పారు. అదేవిధంగా ఆగస్టు 26న నిర్వహించబోయే చేవెళ్ల సభను విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.