తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. విశ్వనగరంలో మ్యాన్ హోళ్లు, వీధి కుక్కలు పిల్లల ప్రాణాలను మింగుతున్నాయన్నారు. ఇవాళ (ఏప్రిల్ 29న) కళాసిగూడలో మౌనిక మరణం తీవ్రంగా కలచివేసిందన్నారు. రాజమహళ్లు - రాచరిక పోకడల ముందు సామాన్యుల ప్రాణాలు వెలవెలబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం వస్తోందని.. గ్రేటర్ ప్రజలరా ప్రభుత్వం పట్టించుకోదని.. మీ ప్రాణాలు మీరే కాపాడుకోవాలని సూచించారు.
ఇవాళ సికాంద్రాబాద్ లోని కళాసిగూడలో మౌనిక అనే చిన్నారి నాళాలో పడి ప్రాణాలు కోల్పోయింది. అలాగే మధుర నగర్ కాలనీలో వీధి కుక్కలు ఓ ఆరుగురిపై దాడికి యత్నించాయి. మధ్యాహ్నం ఒక చిన్న పాప ఆడుకుంటుండగా చిన్నారి మొహంపై దాడి చేశాయి. చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో సన్ రైజ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు అధికారులు.