ఓటమికి పూర్తి బాధ్యత నాదే

ఓటమికి పూర్తి బాధ్యత నాదే

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు కార్యకర్తలను ఎంతో నిరాశకు గురిచేశాయన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హుజురాబాద్ ఎన్నికల రిజల్ట్ పై మీడియాతో మాట్లాడారు. ఫలితాలపై ఎవరూ నిరాశ పడాల్సిన అవసరం లేదన్నారు. ఒక ఉప ఎన్నిక పార్టీ భవిష్యత్ ను నిర్ణయంచలేదన్నారు. బల్మూరి వెంకట్ దీనిపై నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. భవిష్యత్ లో వెంకట్  మంచి నాయకుడు అవుతారన్నారు. తక్కువ సమయంలో ఎక్కువమందికి చేరుకున్నాడని అన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా  గెలిస్తే ఉప్పొంగేది లేదు.. ఓడితే కుంగిపోయేది లేదన్నారు రేవంత్ రెడ్డి.  అంతేకాదు.. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమికి పూర్తి బాధ్యత నాదేనన్నారు. ఓటమి పై సమీక్ష చేసుకుంటాన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సమస్యల పై మరింత బలంగా కొట్లాడుతమన్నారు. ఈ ఉప ఎన్నికలు ప్రత్యేక పరిస్థితుల్లో జరిగాయన్నారు రేవంత్ రెడ్డి.