- ఐటీ, ఈడీ దాడుల వెనుక బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర: రేవంత్
- ఏకే గోయల్ ఇంట్లో రూ.300 కోట్లు దొరికినా, ఎందుకు బయటపెట్టలె?
- కేసీఆర్ అవినీతిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకుంటలె?
- మోదీ జేసీబీలు పెట్టి లేపినా బీఆర్ఎస్ లేవదని కామెంట్
హైదరాబాద్, వెలుగు: ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీతో తమకు పోటీ కాదని.. ఈడీ, ఐటీతోనే తమకు పోటీ అని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. ‘‘ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ల మధ్య ఉన్న ఫెవికాల్బంధం మరోసారి బయటపడింది. ఐటీ, ఈడీ కేవలం కాంగ్రెస్నేతల మీదనే పని చేస్తాయా? వివేక్వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి లాంటి నేతల ఇండ్లపై చేసిన దాడులే ఇందుకు నిదర్శనం” అని మండిపడ్డారు. శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన ఇంట్లో మీడియాతో రేవంత్ మాట్లాడారు.
‘‘బీజేపీలో ఉన్నన్ని రోజులు వివేక్ ను రాముడిలాగా చూసినోళ్లు.. ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో చేరగానే రావణాసురుడిగా చూపిస్తున్నారు. కేసీఆర్ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతోనే వివేక్ బీజేపీని వీడారు. పార్టీ వీడినందుకు ఆయన్ను అంతర్జాతీయ ఆర్థిక ఉగ్రవాదిగా చిత్రీకరించేందుకు బీజేపీ, బీఆర్ఎస్కుట్ర పన్నాయి” అని ఫైర్ అయ్యారు. ‘‘పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బంధువైన పాపానికి రఘురామ్రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు.
రామసహాయం సురేందర్రెడ్డిని ఇప్పటి వరకు వేలెత్తి చూపించినోళ్లు లేరు. కానీ ఇప్పుడు బంధుత్వం కూడా బీఆర్ఎస్దృష్టిలో నేరంగా కనిపిస్తున్నది. ఒప్పందంలో భాగంగానే బీజేపీ, బీఆర్ఎస్కలిసి వారిని టార్గెట్చేశాయి” అని మండిపడ్డారు. ‘‘మాజీ ఐఏఎస్ఏకే గోయల్ఇంట్లో చేసిన తనిఖీల్లో రూ.300 కోట్లు దొరికి నా బయటకు చూపించలేదు. రివర్స్లో కాంగ్రెస్నేతలపైనే లాఠీచార్జ్ చేశారు. గోయల్ రూ.వెయ్యి కో ట్లు పంపిణీ చేశారని మేంఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధి కారి వికాస్రాజ్కు ఫోన్చేస్తే కనీసం ఎత్తడం లేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. కేసీఆర్అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
రైతుబంధు పడ్డదని రైతులు ప్రభావితం కావొద్దు..
రైతుబంధుకు ఈసీ అనుమతి ఇవ్వడం చూస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందం కుదిరిందని అర్థమవుతోందని రేవంత్అన్నారు. రైతుబంధు డబ్బులు పడ్డాయని రైతులు ప్రభావితం కావొద్దని సూచించారు. తాము అధికారంలోకి వస్తే ఇంకో రూ.5 వేలు ఎక్కువే వస్తాయని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఏమిచ్చినా తీసుకోవాలని, తాము అధికారంలోకి వచ్చాక మిగతావి ఇస్తామని తెలిపారు. ‘‘2018 జూన్లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు.
అప్పట్లో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్వచ్చిన వెంటనే రైతుబంధు నిధులను విడుదల చేశారు. ప్రజల సొమ్ముతో ఎన్నికలను కేసీఆర్ప్రభావితం చేశారని ఆనాడు విశ్లేషకులు చెప్పారు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 15లోగా రైతుబంధు వేసేలా బీఆర్ఎస్ సర్కార్ కు ఆదేశాలివ్వాలని కేంద్రానికి, ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాం. ప్రభుత్వ పథకాన్ని దుర్వినియోగం చేయకుండా చూడాలని కోరాం. కానీ పోలింగ్కు నాలుగు రోజులే ఉందనగా రైతుబంధు విడుదలకు ఈసీ గ్రీన్సిగ్నల్ఇచ్చింది. ఈ విషయంలో బీఆర్ఎస్కు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించింది. ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనాలని కేసీఆర్చూస్తున్నారు. 2018లో చేసినట్టే ఇప్పుడూ చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.
ఓట్లను బీఆర్ఎస్ కొంటున్నది..
ఎన్ని కుట్రలు చేసినా, మోదీ జేసీబీలు పెట్టి లేపినా బీఆర్ఎస్ లేవదని.. ఆ పార్టీకి ఓటమి తప్పదని రేవంత్ అన్నారు. ‘‘రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనించాలి. బీఆర్ఎస్, బీజేపీ ప్రసంగాలకు.. జరుగుతున్న తతంగాలకు అసలు పొంతనే లేదు. కాంగ్రెస్గెలుస్తుందన్న చర్చల నేపథ్యంలోనే బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఇన్ని కుట్రలకు తెరలేపుతున్నాయి. డబ్బు సంచులతో ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్ప్రయత్నిస్తున్నారు. ఓటుకు రూ.10 వేలు ఇచ్చి గెలవాలనుకుంటున్నారు. ఇప్పటికే నగదు బదిలీ పథకం మొదలైంది. బీఆర్ఎస్ ఓట్ల కొనుగోలుకు బీజేపీ పూర్తిగా సహకరిస్తున్నది” అని మండిపడ్డారు.