హైకోర్టులో రేవంత్​ పిటిషన్.. ఎందుకంటే?

హైకోర్టులో రేవంత్​ పిటిషన్.. ఎందుకంటే?

ఓఆర్​ఆర్ టెండర్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆ వివరాలు తెలుసుకోవడానికి ఆర్టీఐని సంప్రదించినా వారు స్పందించట్లేదని ఆయన ఆరోపించారు. దీంతో జులై 26న ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్​ వేశారు. 

ఓఆర్​ఆర్​లీజు టెండర్ల విషయంలో అధికార బీఆర్​ఎస్​ హస్తం ఉందని ఆయన పదే పదే ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీఐ కూడా సమాచారం ఇవ్వకపోవడం.. ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో హైకోర్టులో వేసిన పిటిషన్​పై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

ALSO READ :సుప్రీంకు వెళ్లే వరకు తీర్పుపై స్టే ఇవ్వండి..హైకోర్టులో వనమా పిటిషన్ 

ఆర్టీఐకి కమిషనర్​లు లేకపోవడంతోనే సమాచారం రావడం లేదంటూ ఆయన పిటిషన్​లో పేర్కొన్నారు. రూ.లక్ష కోట్ల విలువైన ఓఆర్​ఆర్​ని సీఎం కేసీఆర్​ కుటుంబం పల్లీ బఠాణీల మాదిరి అమ్ముకుంటుందని రేవంత్​గతంలో ఆరోపించారు. 

గ్రోత్​కారిడార్​పరిధిలో ఉన్న ఓఆర్​ఆర్​ని హెచ్​ఎండీఏ కిందకు మార్చడంలో ఉన్న మతలబు బయటపెట్టాలని ఆయన అన్నారు. మంత్రి కేటీఆర్​ బినామీలకు ఔటర్​రింగు రోడ్డుని అమ్మే ప్రయత్నం జరుగుతోందని గతంలో ఆరోపించారు.