రెవెన్యూశాఖలో ..పదోన్నతులు చేపట్టాలి

రెవెన్యూశాఖలో ..పదోన్నతులు చేపట్టాలి

రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ను కోరిన ట్రెసా

హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ శాఖలో  డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతులతో పాటు కింద స్థాయి అన్ని కేడర్లలో పదోన్నతులు చేపట్టాలని ట్రెసా ప్రతినిధులు కోరారు. ఈ మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్​ సెక్రటరీ నవీన్​ మిట్టల్ తో  వారు సమావేశమయ్యారు.  పెండింగ్ లో ఉన్న వీఆర్వోలు, వీఆర్ఏల కారుణ్య నియామకాలను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.-- కమిషనర్, స్టాంప్స్  రిజిస్ట్రేషన్స్,  కమిషనర్ సర్వే అండ్​ సెటిల్మెంట్,  ప్రాజెక్ట్  డైరెక్టర్ భూభారతిగా నవీన్​ మిట్టల్​ అదనపు బాధ్యతలు చేపట్టడంపై ట్రెసా అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్​ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్​ కుమార్​ సోమవారం నవీన్​ మిట్టల్​ను కలిసి సంతోషం వ్యక్తం చేశారు.