భూదాన్ యజ్ఞ బోర్డు ను పునరుద్ధరించండి: తెలంగాణ సర్వోదయ మండలి

భూదాన్ యజ్ఞ బోర్డు ను పునరుద్ధరించండి: తెలంగాణ సర్వోదయ మండలి

బషీర్ బాగ్ - వెలుగు:  గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిర్వీర్యమైన భూదాన్ యజ్ఞ బోర్డును రాష్ట్రంలో తిరిగి పునరుద్ధరించాలని అఖిల భారత సర్వ సేవ సంఘ్ మేనేజింగ్ ట్రస్టీ, తెలంగాణ ప్రభారీ షేక్ హుస్సేన్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. 

హైదరాబాద్‌‌‌‌లో ఆదివారం రాష్ట్ర సర్వసభ్య సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. శంకర్ నాయక్ అధ్యక్షతన జరిగింది.  షేక్ హుస్సేన్ మాట్లాడుతూ..  భూదాన భూములను ప్రభుత్వ స్థలాలుగా పేర్కొంటూ రెవెన్యూ అధికారులు బోర్డు ఏర్పాటు చేయడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి భూకబ్జాదారులపై చర్యలు తీసుకొని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు.