
రామ్ గోపాల్ వర్శ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. త్వరతో వైయస్ జగన్ పైన సినిమా తీస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించాడు. ఇప్పటివరకు ముఖ్య నేతల జీవిత చరిత్రపై సినిమా తీసిన ఆర్జీవీ, జగన్ పై తీయబోయే ఈ సినిమా ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
అయితే, ప్రజల్లో చర్చ నడుస్తున్నట్లుగా ఇది జగన్ జీవిత చరిత్ర కాదని, రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ చుట్టూ చోటు చేసుకున్న రాజకీయ పరిణామంపై తెరకెక్కుతుందని ఆర్జీవీ స్పష్టం చేశాడు. కొద్ది నెలల క్రితం జగన్ తో దాదాపు 40 నిమిషాల పాటు ఆర్జీవి భేటీ కావడం విశేషం. వ్యహం అనే టైటిల్ తో వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా థ్రిల్లర్ జానర్లో వస్తుందని ఆర్జీవీ అన్నాడు. ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసి త్వరలో షూటింగ్ ప్రారంభం చేయనున్నట్లు తెలిపాడు.