ఇది బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్ : రామ్ గోపాల్ వర్మ

ఇది బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్ : రామ్ గోపాల్ వర్మ

వివాదాలకు కేరాఫ్ గా చెప్పుకునే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఆయన మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. "నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను..ఇది బయోపిక్ కాదు.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయోపిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన “వ్యూహం” కథ, రాజకీయ కుట్రల  విషంతో నిండి ఉంటుంది. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం”  చిత్రం.  

ఈ సినిమా 2 పార్ట్స్ గా రాబోతుంది.. మొదటి పార్ట్ “వ్యూహం”, 2వ పార్ట్ “శపథం”.. రెండింటిలోనూ రాజకీయ అరాచకాలు పుష్కలంగా ఉంటాయన్నారు. ప్రేక్షకులు మొదటి చిత్రం “వ్యూహం” షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్, పార్ట్ 2 “శపథం” లో తగులుతుందని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ఈ చిత్రానికి దాసరి కిరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరన్నారు.  ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు, కనక చెప్పట్లేదు అంటూ వర్మ తెలిపాడు.