సుశాంత్ మ‌ర‌ణంపై సీబీఐ విచార‌ణ జ‌రిపించండి

సుశాంత్ మ‌ర‌ణంపై సీబీఐ విచార‌ణ జ‌రిపించండి

అమిత్ షా కు సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ విజ్ఞ‌ప్తి

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణంపై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు అత‌ని గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తి. బుధ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా.. సుశాంత్‌ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలంటూ హోంమంత్రి అమిత్ షా కు విజ్ఞప్తి చేశారు. అమిత్ షా నుద్దేశించి ఆమె చేసిన ట్వీట్‌లో “గౌరవనీయ అమిత్ షా గారూ… నేను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గ‌ర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి. సుశాంత్ ఆక‌స్మిక మ‌ర‌ణం చెంది‌ ఇప్పటికి నెల రోజులు దాటింది. అత‌ని ఆత్మ‌హ‌త్య కేసుకు సంబంధించి ప్రభుత్వంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ కేసు వ్యవహారంలో న్యాయం కోసం సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా”నని పేర్కొన్నారు. ‘ఎలాంటి ఒత్తిళ్ల మ‌ధ్య‌ సుశాంత్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవాలనుకుంటున్నానని, సత్యమేవ జయతే’ అంటూ ట్వీట్‌ను ముగించారు.