ముంబై: ఆసియా గేమ్స్లో పాల్గొనే ఇండియా మెన్స్ టీ20 టీమ్కు యంగ్స్టర్ రుతురాజ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. హైదరాబాదీ తిలక్ వర్మకు ఈ టీమ్లోనూ చోటు దక్కింది. ఐపీఎల్లో అదరగొట్టిన రింకూ సింగ్, జితేష్ శర్మ, ప్రభ్ సిమ్రాన్ సింగ్ నేషనల్ టీమ్ నుంచి పిలుపు అందుకున్నారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు క్రికెట్ పోటీలు జరుగుతాయి. ఆసియా కప్, వరల్డ్ కప్ నేపథ్యంలో సెలెక్షన్ కమిటీ మొత్తం యంగ్స్టర్స్ను ఎంపిక చేసింది. మరోవైపు సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు జరిగే విమెన్స్ టీ20 పోటీలకు హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో రెగ్యులర్ టీమ్నే ప్రకటించింది. టిటాస్ సాధు తొలిసారి నేషనల్ టీమ్కు సెలెక్ట్ అయింది.
మెన్స్ టీమ్: రుతురాజ్ (కెప్టెన్), యశస్వి, త్రిపాఠి, తిలక్, రింకూ, జితేష్ (కీపర్), సుందర్, షాబాజ్ అహ్మద్, బిష్ణోయ్, అవేష్, అర్ష్దీప్, ముకేష్, శివమ్ మావి, దూబే, ప్రభ్సిమ్రాన్ (కీపర్).
విమెన్స్ టీమ్: హర్మన్ప్రీత్ (కెప్టెన్), మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ, రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (కీపర్), అమన్ జోత్, దేవిక వైద్య, అంజలి శర్వాణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా ఛెత్రి (కీపర్), అనూషా బారెడ్డి.