
న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్, తాను మంచి ఫ్రెండ్స్ అని కేరళ బ్యాట్స్మన్ సంజూ శాంసన్ అన్నాడు. ఆట పరంగా తమ మధ్య పోటీ పెట్టొద్దని, టీమ్ అవసరాలకు అనుగుణంగానే జట్టులో చోటు ఉంటుందన్నాడు. తన డెబ్యూ తర్వాత వచ్చిన బ్రేక్.. ప్లేయర్గా తాను ఎదగడానికి ఎంతో సహాయపడిందన్నాడు. ‘2015లో నేను జింబాబ్వేపై అరంగేట్రం చేశాను. ఆ తర్వాత ఐదేళ్లు ఐపీఎల్, డొమెస్టిక్ క్రికెట్ ఆడటం నాకు బాగా కలిసొచ్చింది. ఈ టైమ్ నా కెరీర్లో, జీవితంలో చాలా ముఖ్యమైంది. నా గేమ్ను క్రమంగా మార్చుకున్నా. మానసికంగా చాలా స్ట్రాంగ్ అయ్యా. నా గురించి నేను తెలుసుకున్నా. నా బలం, బలహీనతలనూ గుర్తించా. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు సరిపోయే స్థాయిలో నా ఆటను మల్చుకున్నా’ అని శాంసన్ పేర్కొన్నాడు. వికెట్ కీపర్గా టీమ్లో చోటు కోసం పంత్తో పోటీపడాల్సి వస్తున్న నేపథ్యంలో .. తమ ఇద్దరి మధ్య ఆ సందర్భం రాలేదన్నాడు. ‘టీమ్ కాంబినేషన్పై అన్నీ ఆధారపడి ఉంటాయి. పంత్తో కాంపిటీషన్ అనే అంశాన్ని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. రిషబ్, నేను ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్కు ఆడాం. ఇద్దరం కలిసి చాలా టైమ్ స్పెండ్ చేశాం. మేం మంచి ఫ్రెండ్స్ కూడా. పంత్ చాలా టాలెంటెడ్ ప్లేయర్. గుజరాత్తో జరిగిన ఓ మ్యాచ్లో మేమిద్దరం సిక్సర్ల వర్షం కురిపించాం. 200 టార్గెట్ను ఛేజ్ చేశాం. ఆ పార్ట్నర్షిప్ మాకు ఇంకా గుర్తుంది’ అని శాంసన్ చెప్పుకొచ్చాడు.