టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఎవరి సాయం లేకుండా మెట్లెక్కేసిన పంత్!

టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఎవరి సాయం లేకుండా మెట్లెక్కేసిన పంత్!

గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా యువ క్రికెటర్ రిషభ్‌ పంత్‌ వేగంగా కోలుకుంటున్నాడు. చేతి కర్ర, ఇతరుల సాయం లేకుండా నడుస్తున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ ఆకాడమీలో శిక్షణ పొందుతున్న పంత్‌..పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే పనిలో పడ్డాడు. ఇక  తన హెల్త్‌ అప్‌డేట్స్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నాడు. తాజాగా మరో వీడియో పోస్టు చేశాడు.

తన ట్రైనింగ్‌ సంబంధించిన వీడియోను పంత్‌ షేర్‌ చేశాడు. పంత్‌ ఎటువంటి సపోర్ట్‌ లేకుండా మెట్లు ఎ‍క్కుతుండడం ఈ వీడియోలో  కన్పించింది. అయితే మెట్లు ఎక్కే క్రమంలో ముందుగా పంత్‌ కాస్త ఇబ్బంది పడినా... ఆ తర్వాత మాత్రం కొంచెం ఈజీగా ముందుకు వెళ్లాడు. ఈ వీడియోకు "నాట్ బ్యాడ్ యార్ రిషబ్. చిన్న పనులే కొన్నిసార్లు కష్టంగా ఉంటాయి" అని పంత్ క్యాప్షన్ ఇచ్చాడు.

ఇక ఈ వీడియో చూసిన పంత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనుకున్న దానికన్నా వేగంగా రిషబ్ కోలుకుంటున్నాడని.. త్వరలోనే మైదానంలో కనిపిస్తాడని కామెంట్లు చేస్తున్నారు. పంత్‌ గాయం కారణంగా ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌, ఐపీఎల్‌, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు పంత్‌ దూరమయ్యాడు. రిషబ్‌ తిరిగి మళ్లీ వన్డే వరల్డ్‌కప్‌కు మైదానంలో అడుగుపెట్టే ఛాన్స్‌ ఉంది.