Gold Rate: పాక్ యుద్ధం ప్రకటనతో పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో తులం ఎంతంటే..

Gold Rate: పాక్ యుద్ధం ప్రకటనతో పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో తులం ఎంతంటే..

Gold Price Today: నిన్న పసిడి ధరలు భారీ తగ్గింపును నమోదు చేయటంతో రిటైల్ కొనుగోలుదారులు స్వల్ప ఊరటను పొందారు. అయితే నేడు అధికారికంగా ఇండియాపై పూర్తి స్థాయి సైనిక చర్యలకు పాక్ దిగుతున్నామంటూ యుద్ధం ప్రకటించటంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ క్రమంలో బంగారానికి పెరుగుతున్న డిమాండ్ దాని ధరలను రిటైల్ మార్కెట్లలో భారీగా పెంచేస్తోంది. వారాంతంలో గోల్డ్ షాపింగ్ చేసేవారు తప్పక పెరిగిన రేట్లను గమనించటం ఉత్తమం.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.3వేలు పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే... గ్రాముకు చెన్నైలో రూ.9వేల 045, ముంబైలో రూ.9వేల 045, దిల్లీలో రూ.9వేల 060, కలకత్తాలో రూ.9వేల 045, బెంగళూరులో రూ.9వేల 045, కేరళలో రూ.9వేల 045, వడోదరలో రూ.9వేల 050, అహ్మదాబాదులో రూ.9వేల 050, జైపూరులో రూ.9వేల 060, నాశిక్ లో రూ.9వేల 048, మైసూరులో రూ.9వేల 045, అయోధ్యలో రూ.9వేల 060, నోయిడాలో రూ.9వేల 060, గురుగ్రాములో రూ.9వేల 060గా కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.3వేల 300 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 868, ముంబైలో రూ.9వేల 868, దిల్లీలో రూ.9వేల 883, కలకత్తాలో రూ.9వేల 868, బెంగళూరులో రూ.9వేల 868, కేరళలో రూ.9వేల 868, వడోదరలో రూ.9వేల 873, అహ్మదాబాదులో రూ.9వేల 873, జైపూరులో రూ.9వేల 883, నాశిక్ లో రూ.9వేల 871, మైసూరులో రూ.9వేల 868, అయోధ్యలో రూ.9వేల 883, నోయిడాలో రూ.9వేల 883, గురుగ్రాములో రూ.9వేల 883 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.9వేల 045 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు తగ్గిన తర్వాత రూ.9వేల868గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 10వేల 900 వద్ద  కొనసాగుతోంది.