- సీఎంకు ఆర్.కృష్ణయ్య లెటర్
ముషీరాబాద్, వెలుగు : 2014 ముందు వరకు ట్యూషన్, స్పెషల్ ఫీజులను అప్పటి ప్రభుత్వాలు భరించగా, బీఆర్ఎస్ వచ్చాక పూర్తిగా గండి కొట్టిందని, దీంతో బీసీ విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్రెడ్డి జోక్యం చేసుకొని పూర్తి ఫీజులు మంజూరు చేస్తూ జీఓ జారీ చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం సీఎంకు ఆర్.కృష్ణయ్య లెటర్రాశారు.