బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించాలి : ఆర్.కృష్ణయ్య

బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించాలి : ఆర్.కృష్ణయ్య
  • సీఎంకు ఆర్.కృష్ణయ్య లెటర్​

ముషీరాబాద్, వెలుగు :  2014 ముందు వరకు ట్యూషన్, స్పెషల్​ ఫీజులను అప్పటి ప్రభుత్వాలు భరించగా, బీఆర్ఎస్ ​ వచ్చాక పూర్తిగా గండి కొట్టిందని, దీంతో బీసీ విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్​రెడ్డి జోక్యం చేసుకొని పూర్తి ఫీజులు మంజూరు చేస్తూ జీఓ జారీ చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం సీఎంకు ఆర్.కృష్ణయ్య లెటర్​రాశారు.