![రోడ్డు డిజైనింగ్లో మార్పు తేవాలి : మాల్కం ఉల్ఫ్](https://static.v6velugu.com/uploads/2024/02/road-craft-society-president-malcolm-wolf-says-there-a-change-in-road-designing_I37cKsVBMZ.jpg)
ఖైరతాబాద్, వెలుగు: దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా రోజుకు 500 మంది చనిపోతున్నారని రోడ్ క్రాప్ట్ సొసైటీ అధ్యక్షుడు మాల్కం ఉల్ఫ్, కార్యదర్శి ఆదిశంకర్ పేర్కొన్నారు. వాహనాలు నడిపే వారికి సరైన అవగాహన లేకనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు.
రోడ్డు భద్రతావారోత్సవాల్లో భాగంగా సోమవారం సోమాజీగూడ ప్రెస్క్లబ్లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మోటారువాహనాల చట్టం వందేండ్ల కిందట చేసిందని, దానిలో మార్పులు తీసుకురావాలన్నారు. ముఖ్యంగా వాహనం నడిపే వారిని ఎడ్యుకేట్ చేయాలన్నారు. ఫుట్ పాత్ ల ఆక్రమణలతో ప్రజలు రోడ్డుపై నడిచి ప్రమాదాలకు గురువుతున్నారన్నారు. వాహనాలకు అనుగుణంగా రోడ్డు డిజైన్లో మార్పు తీసుకురావాలని మాల్కం ఉల్ఫ్ ప్రభుత్వానికి సూచించారు.