ఇబ్రహీంపట్నం, వెలుగు: బైకర్లు హెల్మెట్, కారులో వెళ్లేవారు సీట్బెల్ట్పెట్టుకోవాలని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సూచించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా యాచారంలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్నిబంధనలు పాటించాలన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని, క్షేమంగా ఇండ్లకు చేరాలని చెప్పారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, సీఐలు నందీశ్వర్ రెడ్డి, సత్యనారాయణ, మధు, మహేందర్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు .
స్టార్ట్ ఎర్లీ, గో స్లోలీ, రీచ్ సేఫ్లీ పాటించాలి
కూకట్ పల్లి, వెలుగు: స్టార్ట్ఎర్లీ, గో స్లోలీ, రీచ్సేఫ్లీ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని సైబరాబాద్ సీపీ రమేశ్రెడ్డి సూచించారు. వేగం కన్నా ప్రాణం ముఖ్యమనే విషయాన్ని యువత గుర్తించాలన్నారు. బసంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కూకట్పల్లిలోని రంగధాముని చెరువు వద్ద ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వంద మందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. డీసీపీ రితిరాజ్, ఏసీపీ నరేశ్రెడ్డి, సంస్థ నిర్వాహకులు అజయ్రాయుడు, వడ్డేపల్లి కార్తీక్రావు పాల్గొన్నారు.
