కామారెడ్డి జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు

కామారెడ్డి జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు
  • కొట్టకుపోయిన కాజ్​వేలు
  • నరకం చూస్తున్న ప్రయాణికలు

కామారెడ్డి , వెలుగు: ఇటీవల కురిసిన వర్షాలకు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని రోడ్లు దెబ్బతిన్నాయి. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర, కర్నాటక బార్డర్‌‌‌‌‌‌‌‌ లో ఉండే ఈ ఏరియాలో చాలా వరకు   రోడ్లు ఆధ్వానంగా మారాయి. ఏళ్ల తరబడి రిపేర్లకు నోచుకోకపోవడం, కొత్తగా వేసిన రోడ్లు కూడా పలు చోట్ల గుంతలు పడడంతో ఈ రూట్లలో వెళ్లే ప్రజలు నరకం చూస్తున్నారు. మెయిన్​ రోడ్లతో పాటు ఊర్లకు వెళ్లే దారుల్లో కాజ్​వేలు కూడా కొట్టుకుపోవడం, గుంతలు పడడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. జుక్కల్, మద్నూర్, బిచ్కుంద,  పిట్లం, పెద్దకొడల్‌‌‌‌గల్​మండలాల్లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది.  పెద్ద వాహనాలే కాదు బైక్‌‌‌‌లపై కూడా ప్రయాణం చేయలేని దుస్థితి ఉంది. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. బిచ్కుంద మండలం ఎల్లారం, శాంతపూర్, రాజ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ రోడ్డు కంప్లీట్‌‌‌‌గా గుంతలు ఏర్పడ్డాయి. మద్నూర్​ మండలం సిర్పూర్ సమీపంలో నిర్మించిన బ్రిడ్జి కూడా ఇటీవల వరదలకు కొట్టుకుపోయింది. 

కొట్టుకుపోయినా రిపేర్ ​చేయట్లే..

వర్షాలు, వరదలకు చాలా చోట్ల రోడ్లు, కాజ్​వేలు కొట్టుకుపోయాయి. కాజ్ వేలపై పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా తయారయ్యాయి. ఆర్​అండ్​బీ, పంచాయతీరాజ్​శాఖ ఆఫీసర్లు తాత్కలిక రిపేర్లు కూడా చేయడం లేదు. వరదలకు గుంతలు పడిన కాజ్​వేల దగ్గర కనీసం మట్టిని పోసి పూడ్చడం లేదు.  జనం ఆ గుంతల్లో నుంచే పడుతూ లేస్తూ వెహికల్స్‌‌‌‌పై వెళ్తున్నారు. ఇప్పటికైనా ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి  రోడ్లకు రిపేర్ చేయించాలని పలువురు కోరుతున్నారు. 

  • జుక్కల్​- మద్నూర్​ మధ్య రాకపోకల కోసం  మూడేళ్ల కింద రోడ్డు నిర్మాణ పనులు షూరు చేశారు.  ఏండ్లు గడుస్తున్నా  పనులు ఇంకా కంప్లీట్ కాలేదు. మధ్యలో  3 నుంచి 4 కి.మీ మేర పనులు కంప్లీట్ ​కావాల్సి ఉంది. బ్రిడ్జి నిర్మాణ పనులు సగం చేసి వదిలేశారు. దీంతో రెండు మండలాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

  • ఇది బిచ్కుంద మండలం ఎల్లారం- రాజ్​పూర్​- శాంతపూర్‌‌‌‌‌‌‌‌తో పాటు పలు ఊర్లకు వెళ్లే  బీటీ రోడ్డు. ఈ దారిలో చాలా చోట్ల గుంతలు ఏర్పడి రాకపోకలకు ప్రాబ్లమ్ అవుతోంది. ఫోర్​వీలర్స్‌‌‌‌తో పాటు, ఆటోలు, బైక్‌‌‌‌లపై వెళ్లేటప్పుడు జనం నరకయాతన పడుతున్నారు. రోడ్డు రిపేర్​ విషయంలో  యంత్రాంగం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

  • ఇది మద్నూర్ మండలం పెద్ద తడ్గురు - చిన్న తడ్గురు మధ్య రోడ్డు. అప్పటికే గుంతలు పడి ఉన్న కాజ్​వే వద్ద ఇటీవల కురిసిన భారీ వానలతో బీటీ కొట్టుకుపోయి పెద్ద గుంతగా తయారైంది. ఈ తోవలో వెళ్లే వెహికల్స్‌‌‌‌కు ప్రాబ్లమ్ అవుతోంది. రాత్రి వేళ కొత్త వాళ్లు ఎవరైనా వస్తే ప్రమాదానికి గురయ్యే అవకాశముంది.  కాజ్​వే దెబ్బతిని రోజులు గడుస్తున్నా ఆఫీసర్లు కనీసం ఇందులో తట్టెడు మట్టి కూడా పోయడం లేదు.