ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో దొంగలు హల్ చల్ చేశారు. సింగరాయకొండ-కావలి మధ్య రెండు ఎక్స్ప్రెస్ రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్లే హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో చోరీ చేశారు. రైలులోని ఎస్2, ఎస్4, ఎస్6, ఎస్7, ఎస్8 బోగీల్లో దొంగతనానికి పాల్పడ్డారు. ప్రయాణీకుల నుంచి అందిన కాడికి దోచుకుని, వారికి భయాందోళనలకు గురి చేశారు.
దీంతో పాటు సికింద్రాబాద్ నుంచి తాంబరం వెళ్లే చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైల్లోనూ దొంగలు దారుణాలకు పాల్పడ్డారు. ఎస్1, ఎస్2 బోగీల్లోనూ దోపిడీ చేశారు. అర్థరాత్రి గం.1.20 నుంచి 1.50 గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. నిద్రిస్తున్న మహిళల మెడలోని చైన్లు దొంగతనం చేసినట్టు సమాచారం. సంఘటన అనంతరం ప్రయాణికులు కావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.