
స్టట్గర్ట్: ఇండియా వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్న–సాండెర్ గిలి (బెల్జియం) జోడీ.. బాస్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మెన్స్ డబుల్స్ ప్రిక్వార్టర్స్లో మూడోసీడ్ బోపన్న–గిలి 6–3, 5–7, 11–9తో జాకబ్ స్నాటైర్–మార్క్ వాల్నెర్ (జర్మనీ)పై గెలిచారు. మ్యాచ్ మొత్తంలో ఇరుజట్లు చెరో తొమ్మిది ఏస్లు కొట్టాయి. ఇండియా నంబర్వన్ డబుల్స్ ప్లేయర్ యూకీ భాంబ్రీ–రాబర్ట్ గాల్లోవే (అమెరికా) 6–7 (5), 6–7 (5)తో సాంటియాగో గోంజాలె (మెక్సికో)–ఆస్టిన్ క్రాజిసెక్ (అమెరికా) చేతిలో ఓడారు. గంటా 34 నిమిషాల మ్యాచ్లో రెండు సెట్లు టైబ్రేక్గా ముగిశాయి. మరో మ్యాచ్లో ఎన్. శ్రీరామ్ బాలాజీ–మిగుయెల్ రీస్ వారెలా (మెక్సికో) 7–6 (7/5), 3–6, 5–10తో సాడియో డౌంబియా–ఫ్యాబియెన్ రీబౌల్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం చవిచూశారు.