
ఉక్రెయిన్ లో ఉన్న తెలంగాణకు చెందిన MBBS స్టూడెంట్ రోహిత్ బండి సంజయ్ కి కాల్ చేసి మాట్లాడాడు. కరీంనగర్ కోతిరాంపూర్ కు చెందిన అనుమల్ల రోహిత్ ఉక్రెయిన్ లోని క్యూ నేషనల్ మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ 5వ సంవత్సరం చదువుతున్నాడు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్నానంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో మాట్లాడాడు. విద్యార్థులు దైర్యంగా ఉండాలని సూచించారు బండి సంజయ్. ఒకటి రెండు రోజుల్లో అందరిని తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్యం చర్యలు చేపట్టిందన్నారు.
మరిన్ని వార్తల కోసం