
టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా లాంటి జట్టుపై ఒత్తిడి లేకుండా ఎలా కెప్టెన్సీ చేయాలో, బ్యాటింగ్ లో బౌలర్లను ఎలా ఎదురుదాడి చేయాలో విరాట్ కోహ్లీ నుంచి నేర్చుకున్నానని రోహిత్ శర్మ అన్నాడు. భారత క్రికెట్లో టెస్టు కెప్టెన్ గా అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. అతని దగ్గర నేర్చుకునే పాఠాలు చాలానే ఉంటాయి.
‘కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు నేను జట్టులో సభ్యునిగా ఉన్నా. అప్పుడు కోహ్లి నుంచి చాలా నైపుణ్యాలు నేర్చుకున్నా. మనకు వికెట్ పడకపోయినా పరవలేదు. ప్రత్యర్థి జట్టు సహనం కోల్పోయి తప్పు చేసేలా వాళ్లపై ఒత్తిడి తీసుకురావాలనే విషయాన్ని కోహ్లీ దగ్గరనుంచి నేర్చుకున్నా. అదే ఆసీస్ టెస్టులో అమలు చేశా. సరైన ప్రాంతంలో బాల్ వేస్తే పిచ్ సహకరిస్తుంది. అప్పుడే రిజల్ట్ మనం అనుకున్నట్టు వస్తుంద’ని రోహిత్ అన్నాడు. మొదటి టెస్టులో భారత్ ఆస్ట్రేలియాను 171,91 పరుగులకు ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది.