MI vs RCB: కోహ్లీ vs రోహిత్.. 3 నెలల తరువాత ఇద్దరి మధ్య ఫైట్

MI vs RCB: కోహ్లీ vs రోహిత్.. 3 నెలల తరువాత ఇద్దరి మధ్య ఫైట్

ఐపీఎల్ లో నేడు సూపర్ ఫైట్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ తలపడబోతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. సాయంత్రం 7:30 నిమిషాలకు మ్యాచ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటో కాదు కోహ్లీ, రోహిత్ ల మధ్య సమరం. 

ఐపీఎల్ లో బెంగళూరు, ముంబై జట్ల మధ్య మ్యాచ్ కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు కోహ్లీ.. మరోవైపు రోహిత్ శర్మ లాంటి సూపర్ స్టార్స్ ఉండడంతో ఈ మ్యాచ్ కు విపరీతమైన హైప్ నెలకొంది. అయితే ఈ సారి వీరిద్దరూ కెప్టెన్లు గా కాకుండా ప్లేయర్లుగా బరిలోకి దిగడం విశేషం. ఆర్సీబీకి డుప్లెసిస్ కెప్టెన్సీ చేస్తుంటే.. ముంబైను హార్దిక్ పాండ్య లీడ్ చేయనున్నాడు. ఈ ఇద్దరు కలిసి మూడు నెలల విరామం తర్వాత మైదానంలో కనిపించనున్నారు. చివరిసారిగా జనవరిలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో కలిసి ఆడారు. 

ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ సిరీస్ తో దూరమైన కోహ్లీ రెండు నెలలకు పైగా క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ కు తిరిగొచ్చిన విరాట్.. నేడు ముంబై మ్యాచ్ కు సిద్ధమవుతున్నాడు. గెలుపోటముల సంగతి పక్కన పెడితే ఈ మ్యాచ్ కు భారీ సంఖ్యలో అభిమానులు రావడం ఖాయంగా కనిపిస్తుంది. మరి వీరిద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి. ముంబై ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లాడితే కేవలం ఒకటే విజయంతో పాయింట్ల పట్టికలో 8 వ స్థానంలో నిలిచింది. మరోవైపు బెంగళూరు ఆడిన 5 మ్యాచ్ ల్లో ఒకటే మ్యాచ్ గెలిచింది.