
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ బాదాడు. 83 బంతుల్లో రోహిత్ సెంచరీ సాధించాడు. రోహిత్ ఇన్నింగ్స్ లో మొత్తం 9 ఫోర్లు, 6 సిక్సులున్నాయి. రోహిత్ కు ఇది వన్డేల్లో 30 సెంచరీ కావడం విశేషం.మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా 25 ఓవర్లకు గానూ 206 పరుగులు చేసింది. రోహిత్ (101 ), గిల్ (98) పరుగులతో క్రీజులో ఉన్నారు.