WPL : ముంబై ఇండియన్స్ బలం మరింత పెరిగింది: రోహిత్ శర్మ

WPL : ముంబై ఇండియన్స్  బలం మరింత పెరిగింది: రోహిత్  శర్మ

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ముంబై ఇండియన్స్ టీమ్ కు రోహిత్ శర్మ శుభాకాంక్షలు తెలిపాడు. తమ కుటుంబం పెద్దదిగా , బలంగా మారిందన్నాడు. ముంబై మహిళల జట్టును బ్లూ, గోల్డ్ జెర్సీలో చూసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు.

 

కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్..?

WPL తొలి సీజన్ కోసం  వేలం జరిగింది. ఈ వేలంలో ముంబై ఇండియన్స్  టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ను రూ. 1.8 కోట్లకు కొనుగోలు చేసింది. హర్మన్ తో పాటు..నాట్ స్కివర్ బ్రంట్ (ఇంగ్లండ్), అమేలియా కెర్ (న్యూజిలాండ్)  పూజా వస్త్రాకర్ (ఇండియా), యాస్తికా భాటియా (ఇండియా), హీథర్ గ్రాహం (ఆస్ట్రేలియా), ఇస్సీ వాంగ్ (ఇంగ్లండ్), హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్) క్లో ట్రయాన్ (సౌతాఫ్రికా) ప్లేయర్లను దక్కించుకుంది. WPLలో ముంబై ఇండియన్స్ టీమ్కు హర్మన్ ప్రీత్ సారథ్యం వహించే అవకాశం ఉంది.  

ముంబై ఇండియన్స్ WPL టీమ్

హర్మన్‌ప్రీత్ కౌర్, నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, ధార గుజ్జర్,ప్రియాంక నేయిరాలామ్ బాలా,  సైకా ఇషాక్, హేలీ మాథ్యూస్, క్లో ట్రయాన్,  హుమా కాజ్ బిష్ట్, సోనమ్ యాదవ్, జింతామణి కలిత.

ఎప్పటి నుంచి ఎప్పటి వరకు..

WPL మార్చి 4 నుంచి 26 వరకు జరగనుంది. ముంబైలోని రెండు స్టేడియాల్లో ఈ మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఐదు ఫ్రాంచైజీల జట్లు పోటీలో పడనున్నాయి. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్  WPL తొలి సీజన్లో ఆడబోతున్నాయి.