
న్యూఢిల్లీ: పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా ఇళ్లకు రూఫ్టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేశామని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. మరో 30 లక్షల ఇళ్లకు త్వరలోనే బిగిస్తామని అన్నారు. రాష్ట్రాల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం కింద కోటి ఇళ్లకు రూఫ్టాప్ సోలార్ పరికరాలు ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యమన్నారు.
ఇంటి పైకప్పు లేని ప్రజల కోసం యూటిలిటీ-లెడ్ నమూనాను ఆమోదించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నమూనాను వేగవంతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఈ పథకం డిమాండ్ ఆధారితమైనది కాబట్టి మొదట వచ్చిన వారికి మొదట ప్రయోజనాలు అందుతాయని తెలిపారు.
పీఎం సూర్య ఘర్ యోజన కింద సుమారు సగం మంది లబ్ధిదారులకు జీరో కరెంటు బిల్లులు వస్తున్నాయని ప్రహ్లాద్ జోషి చెప్పారు.