
ఎల్బీనగర్, వెలుగు: కర్మాన్ ఘాట్ ధ్యానాంజనేయ దేవాలయంలో కుళ్లిపోయిన ప్రసాదాన్ని పంపిణీ చేశారు. మంగళవారం ఓ భక్తుడు స్వామివారిని దర్శించుకుని ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్లాడు. తెరిచి చూడగా కుళ్లిపోయి కనిపించింది. విషయాన్ని ఆలయ ధర్మకర్తల దృష్టికి తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.