
గండిపేట, వెలుగు: పైసల కోసం నార్సింగి పోలీస్స్టేషన్పరిధిలో మంగళవారం ఓ రౌడీ షీటర్ హల్చల్చేశాడు. జాలర్లను కత్తితో బెదిరించి రూ.11వేలు గుంజుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీరంచెరువు ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ ఓ కేసులు జైలుకు వెళ్లాడు. పోలీసులు అతనిపై రౌడీ షీట్ఓపెన్చేశారు.
వారం కిందట బెయిల్పై బయటికి వచ్చిన ఇర్ఫాన్మంగళవారం ఉదయం పీరంచెరువు వద్ద ఉన్న జాలర్లను కత్తితో బెదిరించాడు. వారి వద్ద ఉన్న రూ. 11వేలును లాక్కున్నాడు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ దాడి చేశాడు. ఈ క్రమంలో ఓ జాలరికి గాయలయ్యాయి. భయంతో జాలర్లు అక్కడి నుంచి పరుగులు తీశారు. బాధితులు నార్సింగి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.