DOP Senthil Kumar: బ్రేకింగ్..ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్ కుమార్ భార్య మృతి

DOP Senthil Kumar: బ్రేకింగ్..ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్ కుమార్ భార్య మృతి

ప్రముఖ  సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్ కుమార్( Senthil Kumar ) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య రూహీ కొద్దిసేపటి క్రితమే కన్ను మూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు రేపు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో జరగనున్నాయి.

COVID-19 సమయం నుండి రూహీకి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. ఇక అప్పటినించి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నరుహి ఇవాళ ఆరోగ్య పరిస్థితి క్షిణించి..ఆర్గాన్స్ కూడా పూర్తిగా ఫెయిల్ అవ్వడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రూహీ మరణం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. సెంథిల్ కుమార్‌ భార్యకు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

సెంథిల్ కుమార్ రూహీ 2009 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. రూహీ యోగా పాఠాలు చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక అతి చిన్న వయసులో ప్రేమించే భార్యని కోల్పోవడంతో సెంథిల్‌ కుమార్‌ కు తీరని లోటని చెప్పుకోవాలి. 

ఐతే సినిమాతో సినిమాటోగ్రాఫర్‌ గా కెరీర్‌ స్టార్ట్ చేసిన సెంథిల్‌ కుమార్‌ సినిమాటిక్ వర్క్ కి ఎన్నో అవార్డులు ఆయనని వరించాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి సినిమాలకు పనిచేసి ఇంటర్నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు పొందారు. సై, ఛత్రపతి. యమదొంగ, అరుంధతి, మగధీర, ఈగ, బాహుబలి, బాహుబలి2, RRR వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలకు DOP గా పనిచేశారు.