అవినీతి తిమింగలం కాదు అంతకు మించి.. ప్రభుత్వ అధికారి ఇంట్లో సీబీఐ రైడ్స్.. ఎంత డబ్బు, బంగారం దొరికిందంటే..

అవినీతి తిమింగలం కాదు అంతకు మించి.. ప్రభుత్వ అధికారి ఇంట్లో సీబీఐ రైడ్స్.. ఎంత డబ్బు, బంగారం దొరికిందంటే..

న్యూఢిల్లీ: ఐఆర్ఎస్ అధికారి అమిత్ కుమార్ అవినీతి తవ్వే కొద్దీ బయటపడుతోంది. లంచం కేసులో డైరెక్టరేట్ ఆఫ్​ట్యాక్స్ పేయర్ సర్వీసెస్లో అడిషనల్ డైరెక్టర్గా పనిచేస్తున్న అమిత్ కుమార్ సింఘాల్ను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. అమిత్ కుమార్ కూడబెట్టిన కోటి రూపాయల అవినీతి సొమ్మును, మూడున్నర కిలోల బంగారాన్ని, 2 కిలోల వెండిని సీబీఐ అధికారులు తాజాగా సీజ్ చేశారు. అమిత్కు సంబంధించిన పంజాబ్, దిల్లీ ఇళ్లల్లో, ప్రదేశాల్లో సీబీఐ సోమవారం సోదాలు చేసింది. ఈ సోదాల్లో కోటి రూపాయల విలువైన నోట్ల కట్టలు బయటపడ్డాయి. 

లంచం కేసులో ఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్​ట్యాక్స్ పేయర్ సర్వీసెస్లో అడిషనల్ డైరెక్టర్గా పనిచేస్తున్న అమిత్ కుమార్ సింఘాల్ సీబీఐకి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. 2007వ బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) అధికారి అయిన అమిత్ కుమార్ సింఘాల్ ఢిల్లీలోని పిజ్జా చైన్ ఔట్లెట్ ఓనర్ నుంచి  రూ.25 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడ్డారు.

అమిత్ రూ.45 లక్షల లంచం డిమాండ్ చేయగా.. మొదటి వాయిదా కింద రూ.25 లక్షలను శనివారం మొహాలీలోని ఆయన నివాసంలో హర్ష్ కోటక్ తీసుకుంటుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు. అమిత్ కుమార్ తరపున లంచం తీసుకుంటున్నట్టు అంగీకరించడంతో హర్ష్ను అరెస్టు చేశారు. వసంత్​కుంజ్లోని నివాసంలో అమిత్ కుమార్ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హర్ష కోటక్ ను, అమిత్ కుమార్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఇద్దరినీ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది.