చెప్పుతో కొడితే చాలు.. రూ.10 లక్షలు ఇస్తారు : తెలుగు పోస్టర్లు.. చెన్నైలో కలకలం

చెప్పుతో కొడితే చాలు.. రూ.10 లక్షలు ఇస్తారు : తెలుగు పోస్టర్లు.. చెన్నైలో కలకలం

సనాతన ధర్మం నిర్మూలించటం కాదు.. సమాధి చేయాలంటూ తమిళనాడు మంత్రి, హీరో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న అయోధ్య పూజారి ఉదయనిధికి తలకు 10 కోట్ల వెల కట్టారు. ఇప్పుడు విజయవాడలో వెలిసిన ఓ పోస్టర్ తమిళనాడు చెన్నైలో చర్చనీయాంశం అయ్యింది. 

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని బలుపెక్కి మాట్లాడిన ఉదయనిధిని చెప్పుతో కొట్టిన వారికి 10 లక్షల రూపాయల డబ్బు ఇస్తామంటూ.. జన జాగరణ సమితి పేరుతో ఆంధ్రప్రదేశ్ లో పోస్టర్లు వెలిశాయి. కింద ఫోన్ నెంబర్ కూడా వేయటం.. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావటంతో జాతీయ మీడియా అటెన్షన్ వచ్చింది. ఈ పోస్టర్లు ఇప్పుడు చెన్నైలో కలకలం రేపుతున్నాయి. ఇంతకీ ఈ పోస్టర్ వెనక పూర్తి వివరాలు ఏంటో చూద్దాం..

ALSO READ: వేములవాడ రాజన్న ఆలయంలోని దర్గాకు తాళం..

మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు చెంపదెబ్బ కొట్టిన వారికి రూ.10 లక్షల నగదు బహుమతి ఇస్తామని జన జాగరణ సమితి అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో హిందూ సంస్థ పోస్టర్లు అంటించింది. ఈ పోస్టర్ లలో సనాతన ధర్మాన్ని  నిర్మూలించాలని బలుపెక్కి మాట్లాడిన  ఉదయనిధి స్టాలిన్‌ను చెప్పుతో కొట్టిన వారికి రూ.10 లక్షల నగదు బహుమతి ఇవ్వబడను అని రాసి ఉంది. కింద  జన జాగరణ సమితితో పాటుగా ఫోన్ నెంబర్ ను కూడా పొందుపరిచారు.  

ఉదయనిధి స్టాలిన్ పై ఎఫ్ఐఆర్ నమోదు 

సనాతన ధర్మంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు  ఉదయ్ నిధి స్టాలిన్ పై ఆ వ్యాఖ్యలను సమర్థించినందుకు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేలపై ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు సీనియర్ న్యాయవాదులు హర్ష్ గుప్తా , రామ్ సింగ్ లోధి రామ్‌పూర్‌లోని కొత్వాలి సివిల్ లైన్స్‌లో ఫిర్యాదు చేశారు.