సినీ నటుడి మాజీ భార్యపై రూ.100 కోట్లు పరువు నష్టం దావా 

సినీ నటుడి మాజీ భార్యపై రూ.100 కోట్లు పరువు నష్టం దావా 

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తన మాజీ భార్య అంజనా పాండే, సోదరుడు  షంసుద్దీన్‌ కు భారీ షాక్ ఇచ్చాడు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించారని ఆరోపిస్తూ అంజనా పాండే, షంసుద్దీన్ పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. ఈ ఇద్దరు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ముంబై హైకోర్టును ఆశ్రయించాడు. అంజనా, షంసుద్దీన్ ఇద్దరూ తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ చేయకూడదని, ఇప్పుడు పెట్టిన పోస్టులు తొలగించాలని హైకోర్టు పిటిషన్ పేర్కొన్నాడు. 

అంతేకాకుండా, 2008 నుంచి షంసుద్దీన్‌ తనకు మేనేజర్‌గా ఉన్నాడని.. తన అకౌంట్స్‌ చూసుకునే వాడని తెలిపాడు. ఆ టైంలోనే ఆర్థికంగా మోసం చేశాడని.. అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేశాడని పిటిషన్ లో కోరాడు నవాజుద్దీన్. మార్చి 30న ఈ కేసుపై విచారణ జరగనుంది.  అయితే, నవాజుద్దీన్‌ మంచి వాడు కాదంటూ అంజనా గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తోంది. ఫేమ్‌ వచ్చాక అతను పూర్తిగా మారిపోయాడని.. మానవత్వం మరిచిపోయాడని ఆమె అన్నారు. తనకి విడాకులు ఇవ్వకుండానే.. ఇచ్చేశానని అందరికీ ప్రచారం చేస్తు్న్నాడని ఆరోపించింది.