మహిళలు, చిన్నారుల భద్రతకు .. రూ.13,412 కోట్ల ఖర్చు

మహిళలు, చిన్నారుల భద్రతకు .. రూ.13,412 కోట్ల ఖర్చు
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: దేశంలోని మహిళలు, చిన్నారుల భద్రత కోసం వివిధ స్కీంలు, ప్రోగ్రాంల కింద రూ.13,412 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 

ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం కోసం రూ.3,375 కోట్లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ కోసం రూ.531.24 కోట్లు, స్కీం ఫర్ మోడ్రనైజేషన్ ఆఫ్ ఫోరెన్సిక్ కోసం రూ.280 కోట్లు, జైళ్ల ఆధునీకరణ కోసం రూ.950 కోట్లు, రాష్ట్ర సైన్స్ ఫోరెన్సిక్ ల్యాబరేటరీల పటిష్టత కోసం రూ.106.75 కోట్లు, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీలు, ఫోరెన్సిక్ డేటా సెంటర్, 6 సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీల ఆధునీకరణకు రూ.354.25 కోట్లు, సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కోసం రూ.2,840 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. 

అలాగే శిక్షణ, సామర్థ్యం పెంపు కోసం రూ.76.5 కోట్లు, పేద ఖైదీల కోసం రూ.60 కోట్లు, మానవ అక్రమ రవాణా నిరోధక (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్) యూనిట్ కోసం రూ.113.76 కోట్లు, మహిళా హెల్ప్ డెస్కుల కోసం రూ.164.2 కోట్లు వెచ్చిస్తున్నట్టు వెల్లడించారు.