మాస్కు పెట్టుకోకపోతే రూ. 2000 ఫైన్

మాస్కు పెట్టుకోకపోతే రూ. 2000 ఫైన్

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో ఢిల్లీ సర్కార్ అప్రమత్తమైంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు పాటించనవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో అధికారులు మాస్కులు ధరించని వారికి ఫైన్లు విధిస్తున్నారు. మాస్కు ధరించకపోతే 2000 రూపాయల ఫైన్ విధిస్తూ.. అందరిని అప్రమత్తం చేస్తున్నారు.