నాగర్ కర్నూల్ జిల్లా ‘సిరసనగండ్ల’ ఆలయ అభివృద్ధికి రూ. 3 కోట్లు: మంత్రి జూపల్లి

నాగర్ కర్నూల్ జిల్లా ‘సిరసనగండ్ల’ ఆలయ అభివృద్ధికి రూ. 3 కోట్లు: మంత్రి జూపల్లి

వంగూరు, వెలుగు:  చారకొండ మండలం సిరసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 

రూ. 2 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కోసం అదనంగా మరో కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 27న జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను, ఆలయ కమిటీని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉమా, ఆలయ కమిటీ చైర్​ పర్సన్, అధికారులు పాల్గొన్నారు.