
- జిల్లా ఇంటర్ బోర్డు నోడల్ అధికారి షేక్ సలామ్
సదాశివనగర్, వెలుగు : కామారెడ్డి జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 3.23 కోట్లు మంజూరు చేసిందని జిల్లా ఇంటర్ బోర్డు అధికారి షేక్ సలామ్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీని తనిఖీ చేసి లెక్చరర్లతో మాట్లాడారు.
జిల్లాలోని జూనియర్ కాలేజీలలో 4 వేల మంది విద్యార్థులను చేర్చాల్సి ఉండగా, 3266 మంది చేరారని, ఈ నెల 31 వరకు అవకాశం ఉందన్నారు. ఓపెన్ టైన్త్ విద్యార్థులు ఇంటర్లో చేరవచ్చన్నారు. కొత్త 57 మంది లెక్చరర్లను ప్రభుత్వం నియమించిందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సింగం శ్రీనివాస్, లెక్చరర్లు పాల్గొన్నారు.