
న్యూఢిల్లీ: మనదేశ ఆటోమోటివ్ సెక్టార్లో సెప్టెంబరు క్వార్టర్లో రికార్డు స్థాయిలో 4.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 38,300 కోట్ల) విలువైన 30 లావాదేవీలు జరిగాయి. టాటా మోటార్స్ ఇవెకో ఎస్పీఏను 3.8 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 31,630 కోట్ల) కొనుగోలు చేసింది.
గ్రాంట్ థార్న్టన్ నివేదిక ప్రకారం.. ఏడాదికి పైగా కాలంలో ఇదే అతిపెద్ద డీల్స్ క్వార్టర్. టాటా మోటార్స్-ఇవెకో డీల్ను మినహాయిస్తే, ఈ క్వార్టర్లో డీల్స్ విలువ జూన్ క్వార్టర్ కంటే 36 శాతం తగ్గింది.
ఈ క్వార్టర్లో ఏడు డీల్స్తో మెర్జర్స్, అక్విజిషన్స్ కార్యకలాపాల విలువ 4.1 బిలియన్ డాలర్లు.ఇది గత క్వార్టర్తో పోలిస్తే సంఖ్యాపరంగా 13 శాతం తగ్గినా, విలువ మాత్రం 1,234 శాతం పెరిగిందని గ్రాంట్ థార్న్టన్ వెల్లడించింది.