రూ.5 లక్షలకే 111 ప్రశ్నలు లీక్.. నీట్ పేపర్‌‌ లీక్‌‌ కేసులో సంచలన విషయాలు వెల్లడించిన సీబీఐ

రూ.5 లక్షలకే 111 ప్రశ్నలు లీక్.. నీట్ పేపర్‌‌ లీక్‌‌ కేసులో సంచలన విషయాలు వెల్లడించిన సీబీఐ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌‌ యూజీ పేపర్​ లీక్‌‌ కేసులో సీబీఐ కీలక విషయాలను కోర్టు ముందుంచింది. మహారాష్ట్రలోని లాతూర్‌‌కు చెందిన కోచింగ్‌‌ సెంటర్‌‌ నిర్వాహకుడు శివరాజ్‌‌ రఘునాథ్‌‌ మోటేగావ్‌‌కర్‌‌.. పరీక్షకు ముందే కెమిస్ట్రీ క్వశ్చన్స్​లీక్​ చేసేందుకు పేపర్  తయారీ కమిటీలో ఉన్న పీవీ కులకర్ణికి రూ.5 లక్షలు ఇచ్చినట్టు వెల్లడించింది. కులకర్ణి నిర్వహించిన కోచింగ్‌‌ తరగతులకు మోటేగావ్‌‌కర్‌‌ కుమారుడు హాజరయ్యాడని, అక్కడే ఈ ప్రశ్నలు అందించినట్లు ఆరోపించింది. 

మోటేగావ్‌‌కర్‌‌ ఫోన్‎లో  ప్రశ్నలకు సంబంధించి 36  ఫొటోలు ఉన్నట్టు తెలిపింది.  ఈ 32 ఫొటోల్లో 132 కెమిస్ట్రీ ప్రశ్నలు ఉన్నాయని వెల్లడించింది. ఈ ప్రశ్నలన్నింటిలో 111 ప్రశ్నలు నీట్‌‌ (యూజీ) కోసం నేషనల్‌‌ టెస్టింగ్‌‌ ఏజెన్సీ (ఎన్‌‌టీఏ) రూపొందించిన మాస్టర్‌‌ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో సరిపోలినట్లు కోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని నిందితులకు బెయిల్‌‌ ఇవ్వొద్దని కోర్టును కోరింది.