
- ఆదుకుంటామని హామీ ఇచ్చిన కేటీఆర్
- వెలుగు కథనానికి స్పందన
భైంసా,వెలుగు: నిర్మల్జిల్లా కుభీర్ మండలం సిర్పెల్లి (హెచ్) గ్రామానికి చెందిన గాడేకర్ సంకీర్తన అనే నిరుపేద దళిత విద్యార్థినికి సాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. నీట్లో ర్యాంకు సాధించి హైదరాబాద్లోని మల్లారెడ్డి మెడికల్కాలేజీలో సీటు సాధించిన సంకీర్తన ఫీజు కట్టలేని స్థితిలో ఉండడంతో వీ6 వెలుగులో ‘సరస్వతి కరుణించినా..లక్ష్మీ కటాక్షం కరువైంది’ హెడ్డింగ్తో కథనం ప్రచురితమైంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా దాతలు స్పందిస్తున్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రూ. 50 వేలను పోగు చేసింది. హెల్పింగ్హ్యాండ్స్సెక్రెటేరియట్గ్రూప్ద్వారా ఈ విరాళాలు సేకరించి గ్రూప్ ప్రెసిడెంట్తులసీదాస్ గైక్వాడ్చేతుల మీదుగా సంకీర్తనకు అందజేశారు. సభ్యులు శంకర్ నాయక్, ప్రశాంత్, సోమన్న, కిశోర్, గంగాలక్ష్మి, భీం ప్రసాద్పాల్గొన్నారు.
ట్విటర్లో పోస్ట్కు కేటీఆర్స్పందన
సంకీర్తన దీన స్థితిపై వీ6 వెలుగులో వచ్చిన కథనాన్ని చూసిన స్ఫూర్తి అనే యువతి రెండు రోజుల కింద ట్విటర్లో మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డిలకు ట్యాగ్చేశారు. దీంతో మంత్రి కేటీఆర్స్పందించి రిప్లై ఇచ్చారు. కొద్దిసేపటికే ఆయన పీఏ సంకీర్తనకు ఫోన్చేసి అధైర్య పడొద్దని, చదువుకు సాయం చేసి ఆదుకుంటామని కేటీఆర్చెప్పారని భరోసా ఇచ్చారు. అలాగే ఇప్పటివరకు పలువురు దాతలు సంకీర్తనకు సుమారు రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం చేశారు.