- బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని 36.68 లక్షల మంది రైతుల్లో 16 లక్షల మందికి రుణమాఫీ కింద రూ.7,753 కోట్లు మాత్రమే విడుదల చేశారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మిగతా 20 లక్షల మంది రైతులకు రూ.11,445.95 కోట్లు ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించారు.
లక్ష రూపాయల రైతు రుణమాఫీ ఆలస్యంపై ‘వెలుగు’లో వచ్చిన వార్తపై ట్విట్టర్లో స్పందించారు. ‘‘రాష్ట్ర ఖజానాలో ఎన్ని డబ్బులు ఉన్నాయో అంచనా లేకుండా రుణమాఫీ ప్రకటన చేశారా? రూ.లక్ష మాఫీ కేవలం ప్రకటనలకే పరిమితమా? లేదా ఎన్నికల స్టంటా?’’అని నిలదీశారు.