దుండిగల్లో రూ.950 కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసం..

దుండిగల్లో రూ.950 కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసం..

హైదరాబాద్లో కోట్ల విలువైన డ్రగ్స్ను అధికారులు ధ్వంసం చేశారు.  పటాన్ చెరులో ఓ ప్రైవేట్ సంస్థలో  స్వాధీనం చేసుకున్న రూ. 950 కోట్ల విలువైన డ్రగ్స్ ను DRI అధికారులు ధ్వంసం చేశారు. 


18 రకాల డ్రగ్స్ ధ్వంసం

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్ లోని హైదరాబాద్ వేస్ట్ మనేజ్మెంట్ ప్రాజెక్ట్ లో మొత్తం 18 రకాల డ్రగ్స్ ను ధ్వసం  చేశారు. 409.39 కిలోల ఆల్ఫా జోలం, 2655.94 కిలోల గంజాయి, 142.93 కిలోల ఎపిడ్రిన్ హైడ్రో క్లోరైడ్, 11 కిలోల హెరైన్, 74.92 కిలోల కెటమైన్, 2.95 కిలోల మెఫిడ్రోన్, 53.98 కిలోల మెతక్విలోన్, 5595 కిలోల ఎఫిడ్రిన్ తో పాటు పలు డ్రగ్స్ డిస్త్రక్షన్ చేశారు.