ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కరోనా

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కరోనా

నాగ్‌పూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన టెస్టుల్లో ఆయనకు వైరస్ పాజిటివ్ రావడంతో నాగపూర్‌లోని కింగ్స్ వే ఆస్పత్రిలో చేర్చామని ఆర్ఎస్ఎస్ వర్గాలు తెలిపాయి. గత నెల 7న భగవత్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకోవడం గమనార్హం. ఆయన ఇంకా రెండో డోసు తీసుకోలేదని తెలిసింది. ఈ విషయాన్ని అటుంచితే.. దేశంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది. ఒక్క శుక్రవారమే 1.31 లక్షల కొత్త పాజిటివ్ కేసులు నమోదవ్వడాన్ని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.