పోలీసులు చేయాల్సిన పనులను ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. వారికి తాము అనుమతి ఇవ్వలేదని .. వారంతట వారే వాహనాలను తనిఖీ చేసినట్లు గుర్తించామన్నారు. ముందుగా వారు పోలీసులను అనుమతి అడిగితే అవసరంలేదని చెప్పినట్లు తెలిపారు. తర్వాత రోజు వారు రోడ్డుపై వాహనాలను ఆపినట్లు కొన్ని ఫొటోలను సోషల్ మీడియా ద్వారా గుర్తించామన్నారు సీపీ. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు రాచకొండ సీపీ మహేష్ భగవత్.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులకు తాము సాయం చేస్తున్నామంటూ ట్విట్టర్ లో ఆర్ఎస్ఎస్ సభ్యులు ఫొటోలను పోస్ట్ చేయడంతో.. పలువురు దీనిని రాచకొండ పోలీస్ అకౌంట్ కు ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన సీపీ పై విధంగా స్పందించారు.