వివిధ కులాలు, వర్గాల ప్రజలు కలిస్తే హిందుత్వం అవుతుందన్నారు ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే. భారత్ గొప్ప శక్తిగా ఎదిగినా.. సాధించాల్సిన అభివృద్ది జరగలేదన్నారు. దేశంలో కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ప్రజల్ని తప్పుదొవ పట్టిస్తున్నాయని, ఇలాంటి సమయంలో హిందూ సమాజాన్ని జాగృతం చేసేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. నల్లగొండ పట్టణంలో ఆర్ఎస్ఎస్ జిల్లా మహా సాంఘిక్ సార్వజనిక ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. అంతకుముందు స్వయం సేవకులు నిర్వహించిన శోభాయాత్ర ఆకట్టుకుంది.