ఆర్ఎస్ఎస్ ప్రచారక్ కేశవ్ హెగ్డే మృతి

ఆర్ఎస్ఎస్ ప్రచారక్ కేశవ్ హెగ్డే మృతి

హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాలతో అనుబంధం ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రచారక్  కేశవ్ హెగ్డే బుధవారం మృతి చెందారు.  బెంగళూర్​లోని వీహెచ్‌పీ ఆఫీసులో ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ బాలస్వామి సంతాపాన్ని  ప్రకటించారు. 

కేశవ్​హెగ్డే కుటుంబానికి సానుభూతి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్  నేతలతో ఆయనకున్న సంబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.