హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాలతో అనుబంధం ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రచారక్ కేశవ్ హెగ్డే బుధవారం మృతి చెందారు. బెంగళూర్లోని వీహెచ్పీ ఆఫీసులో ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఈ సందర్భంగా వీహెచ్పీ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ బాలస్వామి సంతాపాన్ని ప్రకటించారు.
కేశవ్హెగ్డే కుటుంబానికి సానుభూతి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ నేతలతో ఆయనకున్న సంబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.