
- షోరూమ్స్లో ఆటోల లభ్యత, ధరల డిస్ప్లేకు ఆదేశాలు
హైదరాబాద్సిటీ, వెలుగు: రూల్స్కు విరుద్ధంగా కొందరు షోరూమ్ల నిర్వాహకులు ఆటోల ధరలు పెంచి దోచుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ, ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గత రెండు రోజులుగా షోరూమ్స్కు వెళ్లి ఆటోల బుకింగ్వివరాలు, వసూలు చేస్తున్న ధరల గురించి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రతి షోరూంలో ఆటో అమ్మే ధరతో పాటు స్టాక్ వివరాలను డిస్ప్లే చేయాలని ఆదేశించినట్టు ఆర్టీఏ జేటీసీ రమేశ్కుమార్తెలిపారు. ఎక్కువ ధరలు వసూలు చేస్తున్న వారిపై ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
వెబ్సైట్లాగిన్ ఫెసిలిటీ అందరికీ కల్పించాలి
ఆటోల కోసం షోరూమ్స్కు వెళ్లడం వల్లే దోపిడీకి గురవుతున్నామని ఆటో డ్రైవర్ల సంఘం లీడర్లు ఆరోపిస్తున్నారు. వెబ్సైట్లో లాగిన్ అయ్యే అవకాశం కేవలం షోరూమ్స్కే ఇచ్చారని, ఆటో కావాలనుకున్న వారందరికీ లాగిన్అవకాశం ఇవ్వాలని, దీనివల్ల అవినీతికి ఆస్కారం ఉండదని తెలంగాణ ఆటోఅండ్ట్యాక్సీ డ్రైవర్స్యూనియన్అధ్యక్షుడు సీహెచ్నందకిషోర్, ప్రధాన కార్యదర్శి బి.పెంటయ్యగౌడ్ డిమాండ్చేశారు. ఇప్పటి వరకు ఆటో లాగిన్ వివరాలను పూర్తిగా పరిశీలించాలని, బినామీ పేర్లపై కొందరు ఫైనాన్షియర్లు ఆటోలను బ్లాక్ చేసి పెట్టుకున్నారని ఆరోపించారు.
ప్రతి డ్రైవర్ కి కొటేషన్ తప్పకుండా ఇవ్వాలని, ఇప్పటివరకు డీలర్ల ద్వారా, షోరూం ఓనర్ల ద్వారా లాగిన్ చేసిన ఆటోలను క్యాన్సిల్ చేసి రవాణా శాఖ మాత్రమే లాగిన్అయ్యేలా చూడాలని కోరుతున్నారు. అలాగే, ఆటో డ్రైవర్లను దోచుకుంటున్న ఫైనాన్షియర్లపై ఏసీబీ విచారణ జరిపించాలని భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్ధూర్సంఘ్ప్రధాన కార్యదర్శి అల్లూరి రవిశంకర్డిమాండ్ చేశారు.