హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఆర్టీఏ ఆఫీసుల్లో అన్నిరకాల సేవలు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి గురువారం రూ.1.82 కోట్ల ఆదాయం వచ్చిందని రవాణాశాఖ కమిషనర్ ఎంఆర్ ఎం రావు తెలిపారు. ఆర్టీఏ సేవలు తిరిగి ప్రారంభం కావడంతో అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు.