హైదరాబాద్, వెలుగు : ఫ్యాన్సీ నంబర్ల వేలంతో ఖైరతాబాద్ ఆర్టీఏ ( సెంట్రల్ జోన్, టీఎస్ 09)కు రూ.22,07,588 ఇన్కమ్ వచ్చిందని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండురంగ నాయక్ తెలిపారు. టీఎస్ 09 జీఏ 9999 నంబర్ను వెంకటసుబ్బయ్య అనే వ్యక్తి రూ.3,50,009 కి దక్కించుకున్నాడని ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు.
అలాగే టీఎస్ 09 జీబీ 0006 నంబర్ రూ.2,12,116కు, టీఎస్ 09 జీబీ 0005 నంబర్ రూ.1,61,500కు, టీఎస్ 09 జీబీ 9909 నంబర్ రూ.1,15,559కు, టీఎస్ 09 జీబీ 0090 నంబర్ రూ.1,01,000కు అమ్ముడుపోయాయని ఆయన వివరించారు.